తమ స్వల్పకాలిక రాజకీయ లబ్ధి కోసం.. కుర్చీలాట కోసం కొందరు కుహనా రాజకీయ నాయకులు ప్రాంతీయ విభేదాలను సృష్టిస్తున్నారు. నిన్నటివరకు కలిసిమెలిసి ఉన్న సమాజంలో విషబీజాలు నాటుతున్నారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం అమాయక ప్రజల మధ్య చిచ్చుపెడుతూ, వారిని బలిపశువులను చేస్తున్న అరాచకీయాలు నేడు రాజ్యమేలుతున్నాయి. ఏ ఒక్కరి అహం కోసమో, అధికారం కోసమో సామాన్యుడి ప్రాణాలు, ప్రశాంతత బలికావాలా? ఇది ఎంతవరకు న్యాయం?
- Advertisement -
