వనపర్తి జిల్లా (Wanaparthy district) మక్తల్ నియోజకవర్గం (Makthal constituency) ఆత్మకూరు-ఎం (Atmakur-M), అమరచింత మునిసిపాలిటీ(Amarachinta Municipality)ల పరిధిలో రూ.151.92 కోట్ల అభివృద్ధి పనులకు (Development works) సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన (Foundation stone laying) చేశారు. ఆ వివరాలు.. ఆత్మకూరు మునిసిపాలిటీ పరిధిలో రూ.15 కోట్లతో మౌలిక వసతులు, వివిధ అభివృద్ధి పనులు.
రూ.121.92 కోట్లతో ప్రియదర్శి జూరాల ప్రాజెక్టు డ్యాం దిగువన హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం. ఆత్మకూరు మునిసిపాలిటీలో 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణం. రూ.15 కోట్లతో అమరచింత మునిసిపాలిటీ పరిధిలో మౌలిక వసతులు, వివిధ అభివృద్ధి పనులు. ఈ కార్యక్రమానికి మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డితోపాటు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
