వెంకటాపురం మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఆవరణలో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు చిట్యాల సాగర్ వెంకటాపురం మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు యాసం రమేష్ మాదిగ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో యాసం రమేష్ మాదిగ మాట్లాడుతూ వెంకటాపురం మండలంలోని కాంగ్రెస్ పార్టీ మాదిగలను గుర్తించి పదవులు ఇచ్చిన వెంకటాపురం కాంగ్రెస్ పార్టీ నాయకులకి, మంత్రివర్యులు దనసరి సీతక్కకు, అలాగే ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ అన్నకి, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావుకి యాసం రమేష్ మాదిగ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త తిప్పనపల్లి రాంబాబు, మాజీ ఎంపీటీసీ చిట్యాల అరుణ్ కుమార్ మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు యాసం మహేష్ మాదిగ, చెన్నం నరసింహారావు మాదిగ, చిట్యాల రవీందర్ మాదిగ, సమ్మాలు మాదిగ తదితరులు పాల్గొన్నారు.
