హైదరాబాద్ నగరంలో ఇందిరమ్మ క్యాంటీన్లు మరో రెండు చోట్ల అందుబాటులోకి వచ్చాయి. బాగ్లింగంపల్లి(BaghLingampally), కవాడిగూడ(Kawadiguda)లో ఏర్పాటుచేసిన కొత్త క్యాంటీన్లను మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar).. GHMC మేయర్ గద్వాల్ విజయలక్ష్మి(MAYOR Gadwal Vijayalaxmi)తో కలిసి ప్రారంభించారు. దినసరి కూలీలు, కార్మికులు, ఆటో డ్రైవర్లు, పట్టణ పేదల కోసం ఈ కేంద్రాల్లో కేవలం రూ.5కే తాజా అల్పాహారం, రూ.5కే భోజనం అందిస్తున్నారు. ఆకలి లేని హైదరాబాద్ అనే సీఎం రేవంత్ రెడ్డి దార్శనికతలో భాగంగా GHMC త్వరలో అన్ని అనువైన ప్రాంతాల్లో మరిన్ని క్యాంటీన్లను ప్రారంభిస్తుందని పొన్నం ప్రభాకర్ తెలిపారు.
- Advertisement -
