ఆకలి తీరిన చోటే అక్షరం చిగురిస్తుంది…
పౌష్టికాహార బలమే రేపటి భవిష్యత్తును
నిర్మిస్తుంది.. బడి గంటల చప్పుడుతో పాటు..
బాలల ముఖాల్లో పోషకాల చిరునవ్వులు
పూయిస్తూ.. వేసవి సెలవుల ముగింపును
విద్యాసంవత్సరపు సరికొత్త ఆరంభంగా
మార్చింది తెలంగాణ సర్కారు. ప్రీ-ప్రైమరీ నుంచి
ఇంటర్మీడియట్ వరకు.. ‘పాలు, రాగి మాల్ట్’
అల్పాహార అమృతంగా, జూనియర్ కాలేజీలకు
సైతం విస్తరించిన మధ్యాహ్న భోజనమే ప్రగతి
రథంగా.. లక్షలాది మంది విద్యార్థుల ఆకలిని
తీరుస్తూ, అక్షరాల బాట పట్టిస్తోంది.
పౌష్టికాహార లోపానికి చరమగీతం పాడుతూ,
హాజరు శాతాన్ని పెంచుతూ, డ్రాపౌట్లను
అడ్డుకుంటూ… జ్ఞాన తెలంగాణను సగర్వంగా
విష్కరిస్తున్న ఈ విజన్ – కేవలం ఒక పథకం
కాదు, బంగారు భవిష్యత్తుకు బలమైన పునాది..
- Advertisement -
