బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రి నూతన భవనం కార్మికులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధమైంది. రూ.80 లక్షల వ్యయంతో పునర్నిర్మాణం చేపట్టి ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దిన ఈ ఆసుపత్రిని సింగరేణి డైరెక్టర్ కే వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సేవలను మరింత బలోపేతం చేసి కార్మిక కుటుంబాల ఆశలను నెరవేర్చుతామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి జీఎం విజయ భాస్కర్ రెడ్డి, డివైసీఎంవో పాండురంగ చారి, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, సీనియర్ నాయకుడు చిప్ప నర్సయ్య, ఏఐటీయూసీ ఆసుపత్రి ఫిట్ సెక్రటరీ శ్రీధర్, టీబీజీకేఎస్ కార్యదర్శి అనుముల సత్యనారాయణతో పాటు ఆసుపత్రి మెట్రిన్, మెడికల్ ఆఫీసర్లు, వైద్యులు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు
- Advertisement -
