- ముషీరాబాద్లోని తన ఇంట్లో నుండే డ్ర*గ్స్ అమ్మకాలు
- డాక్టర్ను అరెస్ట్ చేసిన పోలీసులు.. మరో ముగ్గురిపై కేసు నమోదు
- పట్టుబడ్డ డ్ర*గ్స్ విలువ రూ.3లక్షలు
ముషీరాబాద్లో ఓ వైద్యుడి ఇంట్లో డ్ర*గ్స్ పట్టుబడటం తీవ్ర కలకలం రేపుతోంది. దాదాపు మూడు లక్షల విలువైన డ్ర*గ్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ను అరెస్ట్ చేసిన పోలీసులు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ముగ్గురు యువకులతో కలిసి జాన్ పాల్ అనే డాక్టర్ ఢిల్లీ, బెంగళూరు నుంచి డ్ర*గ్స్ తెప్పించి అమ్మకాలు సాగిస్తున్నారు. ముషీరాబాద్లో ఓ ఇంట్లో ఉంటూ డ్ర*గ్స్ అమ్మకాలు జరుపుతున్నాడు.
పక్కా సమాచారంతో డాక్టర్ ఇంట్లో సోదాలు జరిపిన ఎక్సైజ్ ఎస్టీఎఫ్బీ బృందానికి భారీగా డ్ర*గ్స్ లభించింది. వైద్యుడి ఇంట్లో డ్ర*గ్స్ చూసి ఎక్సైజ్ పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ముగ్గురు స్నేహితులు కలసిడ్ర*గ్స్ దందా చేపట్టారు. హైదరాబాద్కు చెందిన ప్రమోద్, సందీప్, శరత్ అనే యువకులు.. బెంగుళూరు, ఢిల్లీ నుంచి డ్ర*గ్స్ ను తీసుకొచ్చి.. డాక్టర్ జాన్పాల్ నివాసంలో పెట్టి అమ్మకాలు సాగిస్తున్నారు.
ఇందుకు డాక్టర్ సహకరించాడు. డాక్టర్ స్వయంగా డ్ర*గ్స్ వాడటంతో పాటు వాటిని అమ్మకాలు జరుపుతున్నట్లు ఎస్టీఎఫ్ టీం గుర్తించింది. డ్ర*గ్స్ దందాపై సమాచారం అందిన వెంటనే ఎస్టీఎఫ్ బృందం డాక్టర్ జాన్ పాల్ ఇంట్లో సోదాలు నిర్వహించారని…. ఈ సోదాల్లో భారీగా డ్ర*గ్స్ పట్టుబడినట్లు ప్రదీప్ తెలిపారు. డాక్టర్ జాన్ పాల్ ఇంట్లో ఓజి కుష్, ఎండిఎంఎ, ఎల్ఎన్ది బాస్ట్స్, కొకైన్, గుమ్మస్, హాసిస్ ఆయిల్ను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ డ్ర*గ్స్ విలువ రూ. మూడు లక్షలు ఉంటుందని తెలిపారు. అయితే డ్ర*గ్స్తె తెప్పిస్తున్న ప్రమోద్, సందీప్, శరతులు ప్రస్తుతం పరారీలో ఉండగా.. వీరిపై కూడా కేసు నమోదు అయ్యింది.
