కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా
కేసీఆర్ (Kcr) మరోసారి సీఎం (CM) అవుతారని కేటీఆర్ (Ktr) కలలు కంటున్నారని కేంద్ర మంత్రి (Central Minister) కిషన్ రెడ్డి (Kishan Reddy) ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) పని అయిపోయిందని, అదిప్పుడు ఫామ్ హౌజ్(Farmhouse) పార్టీ అని విమర్శించారు. అజారుద్దీన్(Azharuddin)కు మంత్రి పదవి ఇవ్వడం బీజేపీ(Bjp)కి ప్లస్ పాయింట్గా మారిందని చెప్పారు. అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(JubileeHills Bye Election)లో ఓటమి భయంతో ఓ వర్గం మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలంగా ఎదుగుతోందని, ప్రజలు మార్పుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
