ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఏయూ ఎస్ఎఫ్బీ) తన సీఎస్ఆర్ విభాగం ఏయూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘ఏక్ పేడ్ మా కే నామ్ 3.0’ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లో వన మహోత్సవాన్ని నిర్వహించింది. ఘట్కేసర్లోని బాసిల్ వుడ్స్ నేచర్ స్కూల్లో జరిగిన ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఫణి శంకర్ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.
దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 580కు పైగా శాఖల ద్వారా 5 వేలకుపైగా మొక్కలను నాటడంతో పాటు 12 వేలకుపైగా సీడ్-పేపర్ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడం, సుస్థిర అభివృద్ధికి తోడ్పడటమే ఈ కార్యక్రమం లక్ష్యమని బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు.
- Advertisement -
