వినోదంతో పాటు సందేశాత్మకంగా ‘అరేయ్ ఆపండ్రా’ చిత్రాన్ని నిర్మించినట్లు ఆ చిత్ర దర్శకుడు, నటుడు తల్లాడ సాయి కృష్ణ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీనియర్ నటులు కిశోర్ దాస్, భద్రంతో కలిసి ఆయన వివరాలను వెల్లడించారు. అతి తక్కువ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించామని, ఈమధ్య జర్నీ నేపథ్యంలో వస్తున్న సినిమాలు బాగా ఆడుతున్నాయి. ఈ సినిమాలో కూడా అంతర్లీనంగా మెసేజ్ ఉన్నా పూర్తిగా హాస్య భరితమైన సినిమా తో వస్తున్నాము.

సాంకేతికపరంగా ఎంతో విలువలు పాటించామని, ఎలాంటి అశ్లీలతకు తావు లేకుండా కుటుంబ సమేతంగా వీక్షించే విధంగా చిత్రాన్ని తెరకెక్కించామని తెలిపారు. ఈ నెల 15న రాష్ట్ర వ్యాప్తంగా 50 థీయేటర్లలో సినిమాను విడదుల చేస్తున్నామని, ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ అశోక్ నిమ్మల, నటుడు వినోద్, ఎడిటర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
