- దాతృత్వం చూపిన మురికి చంద్రమౌళి కుటుంబం..
- దాతలు ఎవరైనా ఉంటే టెంపుల్ కమిటీని సంప్రదించాలని మనవి..
కోటిలోని ఇసామియా బజార్ యోగానంద లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయానికి మురికి చంద్రమౌళి కుటుంబబం రూ 2,50,000/-లు విరాళంగా అందజేశారు.. స్వామి వారి వసతి గృహం కోసం 100 గజాల స్థలం కావాలంటూ గతంలోనే ప్రకటించారు ఆలయ కమిటీ సభ్యులు.. రెండు గజాల స్థలానికి గాను రూ. 2,50,000 విరాళంగా ఇచ్చి, మిగతా దాతలు ఎవరైనా ఉంటే టెంపుల్ కమిటీ వారిని సంప్రదించి విరాళంగా ఇవ్వండి అంటూ చంద్రమౌళి పిలుపునిచ్చారు.. లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ భక్తులకు, వారి కుటుంబాలకు ఉండాలని కోరుకుంటూ.. ఆయన కుటుంబ సమేతంగా ఆలయాని వచ్చి నగదును పూజారికి అందచేశారు.. ఆయనతో బాటు ఆయన సతీమణి బాల లక్ష్మీ, కొడుకు సంతోష్ కుమార్ – ప్రతిభ, సంపత్ కుమార్ – పల్లవి, సతీష్ కుమార్ – శ్వేతలు కూడా ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు..
