వానలు పడే సమయంలో ఎండలు దంచి కొట్టబట్టే.. నాటిన పంటలు ఎండిపోవట్టే.. రైతులు గుండెలు బాదుకోబట్టే.. అండగా ఉంటమని అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పిన నాయకులను ఎంచుకొని తప్పుచేసాం అని ఒక్కసారి కూడా అనుకోరా..? ఓ తెలంగాణ రైతన్నలారా.. ఆదుకుంటాం అనేది పేపర్ ప్రకటనలకే సరిపోయే.. అకాల ఎండలతో నష్టపోయిన రైతన్నలకు ధైర్యం చెప్పలేరా… కౌలు రైతులకు 12,000 ఇస్తానని ప్రజల సాక్షిగా.. అంతరాత్మ సాక్షిగా.. చెప్పిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకు పది రూపాయలు కూడా సాయం చేయకపోయే.. ఓ రైతన్నలారా.. ఈ ప్రభుత్వాన్ని నమ్ముతే… ఎండకు ఎండిపోతాం.. జరభద్రం..
- మర్రి నాగిరెడ్డి కేరెల్లి
- Advertisement -
