Wednesday, February 25, 2026
Homeబిజినెస్Silver | వెండి ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా..?

Silver | వెండి ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా..?

వెండి ధరలు నిరంతరం హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. నవంబర్ 29న వెండి కిలోకు రూ.4 లక్షల మార్కును దాటగా, మరుసటి రోజు రూ.80,000 భారీ పతనం అయ్యింది. ఇప్పుడు కిలో వెండి రూ.3 లక్షలకు దిగి వచ్చింది. గత సంవత్సరం నుండి వెండి ధర పెరుగుతూనే ఉంది. దీనికి కారణం ఇప్పటివరకు ఆభరణాలలో మాత్రమే ఉపయోగించే వెండిని పారిశ్రామికంగా ఉపయోగించడం పెరిగింది. నేడు కార్లతో పాటు మొబైల్ ఫోన్లు, సోలార్ ప్యానెల్స్‌లో కూడా వెండిని ఉపయోగిస్తున్నారు.

కార్లలో వెండి వాడకం కొత్తది కాదు. 100 సంవత్సరాలకు పైగా కార్లలో వెండిని ఉపయోగిస్తున్నారు. గతంలో ఇది లైట్స్‌, రిఫ్లెక్టర్ల కోసం ఉపయోగించారు. నేడు ఇది ఎలక్ట్రానిక్స్, ఈవీ టెక్నాలజీకి వెన్నెముకగా మారింది. 2000 నుండి మరిన్ని హైటెక్ కార్లు తయారు చేస్తున్నందున దీని వాడకం పెరిగింది. అయితే 2010 తర్వాత ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లు మార్కెట్లోకి వచ్చినప్పటి నుండి వెండి వాడకం పెరిగింది. ఎందుకంటే ఈ వాహనాలలోని చాలా భాగాలలో వెండిని ఉపయోగిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News