Homeబిజినెస్Airtel | రీఛార్జ్ ప్లాన్ పెంచిన ఎయిర్ టెల్..

Airtel | రీఛార్జ్ ప్లాన్ పెంచిన ఎయిర్ టెల్..

  • రూ. 349 నుంచి ప్రారఖ్రంభం..
  • అధికారిక ప్రకటన రావాల్సి వుంది..

ఎయిర్‌టెల్ తన అత్యంత చవక అన్‌లిమిటెడ్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ అయిన రూ.299 ప్యాక్‌ను నిలిపివేసింది. ఈ ప్లాన్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ యాప్ నుంచి కూడా తొలగించింది. దీంతో ఇకపై రూ.349 ప్లాన్ ఎయిర్‌టెల్‌లో అత్యంత తక్కువ ధరలో లభించే అన్‌లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్‌గా మారింది. గతంలో రూ.299 ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 1జీబీ డేటా, అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, ఉచిత కాలర్ ట్యూన్స్, పర్‌ప్లెక్సిటీ ప్రో ఏఐ సబ్‌స్క్రిప్షన్ వంటి ప్రయోజనాలు ఉండేవి. ఇప్పుడు అందుబాటులో ఉన్న రూ.349 ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజుకు 2జీబీ హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి.

అదనంగా 6 నెలల యాపిల్‌ మ్యూజిక్‌ సబ్‌స్క్రిప్షన్, ఉచిత ఎయిర్‌టెల్‌ హలో ట్యూన్స్‌, 12 నెలల అడోబ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కూడా అందిస్తోంది. అలాగే రూ.399 ప్లాన్‌లో రోజుకు 2.5 జీబీ డేటాతో పాటు 28 రోజుల జియోహాట్‌స్టార్‌ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తోంది. ఎయిర్‌టెల్ రూ.579, రూ.619 ప్రీపెయిడ్ ప్లాన్‌లను కూడా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ సర్కిళ్లలో నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు ప్లాన్‌లు ప్రస్తుతం ఎయిర్‌టెల్ అధికారిక వెబ్‌సైట్‌లో ఇంకా కనిపిస్తున్నాయి. కాబట్టి వాటి నిలిపివేతపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News