- బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పట్టాపురం ఏకాంతం గౌడ్.
వరంగల్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలోపేతం చేయడానికి సమన్వయంతో అహర్నిశలు కృషి చేస్తానని బిజెపి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన పట్టాపురం ఏకాంతం గౌడ్ అన్నారు. సోమవారం పర్వతగిరి మండల కేంద్రంలో ఈ సందర్భంగా మాట్లాడుతూ తన పై నమ్మకంతో వరంగల్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులుగా రెండవసారి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి, జిల్లా నాయకత్వానికి, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేష్, కొండేటి శ్రీధర్ లతోపాటు, బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవి కుమార్, మల్లాడి తిరుపతి రెడ్డి, జిల్లా, మండల నాయకులకు, కార్యకర్తలందరికీ ఈ బాధ్యతలు రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
