కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(Union Minister Nitin Gadkari)కి తెలంగాణ రాష్ట్ర మంత్రి (Telangana State Minister) కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 19, 20 తేదీల్లో న్యూఢిల్లీ ద్వారక(Dwarka)లోని యశోభూమి(Yashobhoomi)లో జరిగే జాతీయ చింతన్ శిబిరానికి (National Chintan Shivir) తనను సాదరంగా ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు చెప్పారు. హైవే అభివృద్ధి, వినూత్న కనెక్టివిటీ ప్రణాళిక, రోడ్డు భద్రత, స్మార్ట్ రోడ్లు తదితర అంశాలపై జరిగే చర్చల్లో పాల్గొనడం, తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా మెరుగైన రోడ్ల మౌలిక సదుపాయాల కోసం కేంద్ర, రాష్ట్ర సహకారాన్ని బలోపేతం చేయడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.
- Advertisement -
