రాష్ట్రపతి (President) ద్రౌపది ముర్ము(Droupadi Murmu)కి బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Verma), సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) స్వాగతం పలికారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహిస్తున్న భారతీయ కళా మహోత్సవాన్ని(2వ ఎడిషన్ను) ప్రారంభించడానికి రాష్ట్రపతి నగరానికి వచ్చారు. రాష్ట్రపతికి స్వాగతం పలికినవారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy), మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), మేయర్ గద్వాల విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, త్రివిధ దళాల ప్రతినిధులు, నగర ప్రముఖులు ఉన్నారు.


- Advertisement -
