చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడి
అమరావతి: ఏపీలోని టెక్స్టైల్స్ రంగం(Textiles)లో పెట్టుబడులు (Investments) పెట్టడానికి 9 కంపెనీలు (Companies) ఆసక్తి చూపుతున్నట్లు చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత (Minister S.Savitha) తెలిపారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖ(Vishaka)లో జరిగే పార్టనర్షిప్ సమ్మిట్(Partnership Summit)లో రాష్ట్ర ప్రభుత్వంతో ఈ కంపెనీల ప్రతినిధులు ఎంవోయూలు కుదుర్చుకోనున్నట్లు చెప్పారు. సచివాలయంలోని తన ఛాంబర్లో తొమ్మిది కంపెనీల ప్రతినిధులతో మంత్రి సవిత సమావేశమయ్యారు. వారిలో అయిదుగురు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. మేటరెస్ మాన్యూఫ్యాక్చరింగ్, అపెరిల్ ప్రొడక్షన్, గార్మెంట్స్ తయారీ, పోలిస్టర్ వేడింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఆ కంపెనీ ప్రతినిధులు ఆసక్తి చూపారన్నారు.
కంపెనీలను రాయలసీమలో ఏర్పాటుచేయడానికి ముందుకొచ్చారన్నారు. ఏయే ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటుచేయబోయేది సమ్మిట్లో ఖరారు కానుందని వెల్లడించారు. సీఎం చంద్రబాబు (CM Chandrababu) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన టెక్స్టైల్స్ పాలసీతో ఏపీలో పెట్టుబడులకు పలువురు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారన్నారు. రాబోయే కాలంలో మరికొందరు పెట్టుబడుదారులు ఏపీలో తమ కంపెనీల ఏర్పాటుకు ముందుకొచ్చే అవకాశముందన్నారు. సమావేశానికి హాజరైన నలుగురు పెట్టుబడుదారులను మంత్రి సవిత సత్కరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్పీ సోసిడియా, కమిషనర్ రేఖారాణి తదితరులు పాల్గొన్నారు.

