గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జోగినపల్లి శ్రీనివాస్ రావు హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన కుమారుడు అమెరికాలో ఉన్నారు. ఆయన వచ్చాక అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలిసింది. కేటీఆర్ కు స్వయాన మేన మామ.. శ్రీనివాస్ రావు మరణం నేపథ్యంలో కేటీఆర్ ఈ రోజు హైదరాబాద్ లో ముందుగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు కూడా తన కార్యక్రమాలను వాయిదా వేసుకుని యశోద ఆసుపత్రి వెళ్తున్నారు.
- Advertisement -
