Thursday, April 23, 2026
HomeజాతీయంWest Bengal | పశ్చిమ బెంగాల్ లో రికార్డు స్థాయి ఓటింగ్..

West Bengal | పశ్చిమ బెంగాల్ లో రికార్డు స్థాయి ఓటింగ్..

  • ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ..
  • తృణమూల్ పై ఘాటు విమర్శలు..

ప‌శ్చిమ బెంగాల్‌లో ఇవాళ అసెంబ్లీ తొలి విడ‌త ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. రికార్డు స్థాయిలో ఓటింగ్ జ‌రుగుతున్నట్లు గ‌ణాంకాలు చెబుతున్నాయి. అయితే కృష్ణ‌న‌గ‌ర్‌లో ఇవాళ జ‌రిగిన ఎన్నిక‌ల స‌భ‌లో ప్ర‌ధాని మోదీ పాల్గొని మాట్లాడారు. తృణ‌మూల్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప‌ట్ల ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌న్నారు. ప‌రిపాల‌న స‌రిగా లేని, బాధ్య‌త లేని ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా భారీ ఓటింగ్ జ‌రుగుతున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

ఆ పార్టీ పాల్ప‌డిన అవినీతి, అస‌మ‌ర్థ‌త ప‌ట్ల ప్ర‌జ‌లు విసిగిపోయిన‌ట్లు ఆయ‌న చెప్పారు. రికార్డు స్థాయిలో ఓటింగ్ జ‌రుగుతోంద‌ని, ప్ర‌జ‌లు త‌మ ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నార‌ని, మే 4వ తేదీన బీజేపీ విజ‌యం ఖాయం అవుతుంద‌ని ప్ర‌ధాని తెలిపారు. ఇటీవ‌ల ఎన్నిక‌ల ప్ర‌చారం స‌మ‌యంలో జార్‌గ్రామ్‌లోని ఓ షాపుకు వెళ్లి జాల్‌ముడి(ముర‌మురాల స్నాక్‌) తిన్నాన‌ని, కానీ మిర‌ప ఘాటు మాత్రం టీఎంసికి త‌గిలిన‌ట్లు ప్ర‌ధాని మోదీ విమ‌ర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News