వ్యక్తిగత పర్యటన (Personal Tour) నిమిత్తం లండన్ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu), ఆయన సతీమణి భువనేశ్వరి(Bhuvaneshwari)కి అక్కడి తెలుగు కుటుంబాలు (Telugu Families) ఘన స్వాగతం (Grand Welcome) పలికాయి. దీని పట్ల చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. ఈ నెల 4న ప్రతిష్టాత్మక సంస్థ ఐఓడీ నుంచి భువనేశ్వరి 2 అవార్డులు (Awards) అందుకోనున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ (Ntr Trust) మేనేజింగ్ ట్రస్టీ హోదాలో ప్రజాసేవ, సామాజిక ప్రభావంలో డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డు, ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో హెరిటెజ్ ఫుడ్స్ సంస్థ వీసీఎండీ హోదాలో గోల్డెన్ పీకాక్ అవార్డును ఆమె అందుకోబోతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తాను ఎంతో సంతోషంగా ఎదురుచూస్తున్నానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
London | సీఎం చంద్రబాబు దంపతులకు ఘన స్వాగతం
RELATED ARTICLES
- Advertisment -
