HomeజాతీయంOm Birla | మహిళా శక్తి నానాటికీ పురోగమిస్తోంది

Om Birla | మహిళా శక్తి నానాటికీ పురోగమిస్తోంది

  • వారి భాగస్వామ్యం లేకుండా ఏ దేశమూ అభివృద్ధి చెందలేదు
  • ఆడబిడ్డల స్వావలంబనతోనే వృద్ధి
  • అన్ని రంగాల్లోనూ వారికి సముచిత స్థానం
  • మహిళా సాధికారత నిరంతర ప్రక్రియ
  • లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఉద్ఘాటన

సోమవారం తిరుపతిలో ముగిసిన పార్లమెంటరీ మరియు శాసనసభ కమిటీల తొలి జాతీయ సదస్సులో మహిళల సాధికారత కోసం స్థిరమైన ఆర్థిక సాధికారత మోడళ్ల అవసరాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రస్తావించారు. ఈ సందర్భంగా “తిరువతి తీర్మానం” ఆమోదించబడింది. చారిత్రాత్మకంగా మహిళా సాధికారతకు అంకితమైన ఈ పార్లమెంటరీ సదస్సు ముగింపు సమావేశంలో లోక్సభ స్పీకర్ ప్రసంగిస్తూ.. మహిళల సాధికారత అనేది కేవలం సామాజిక అవసరం మాత్రమే కాకుండా ఆర్ధిక అవసరం కూడా అని పేర్కొన్నారు. మహిళల ఆరోగ్యం, విద్య, నైపుణ్యాలు, వ్యాపారారంభంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారతదేశం అపారమైన మానవ వనరులను వెలికి తీయగలదని, బలమైన సామాజిక-ఆర్ధిక అభివృద్ధి నమూనాను నిర్మించగలదని అన్నారు. వికసిత్ భారత్ వైపు భారతదేశ ప్రయాణంలో మహిళల నాయకత్వం, వారి సహకారం కీలకమని తెలిపారు. ఇలాంటి సదస్సులు కేంద్రం, రాష్ట్రాల అనుభవాలను పంచుకునే వేదికలుగా పనిచేస్తాయన్నారు. ప్రజాస్వామ్య అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా, భారతదేశంలో ప్రజాస్వామ్యం కేవలం రాజకీయ వ్యవస్థ మాత్రమే కాదు, ఇది నాగరికతా విలువ మరియు జీవన విధానం అని ప్రస్తావించారు.

No country has ever developed without the participation of women 2

భారతదేశం శతాబ్దాలుగా సమా నత్వం, సంభాషణ, భాగస్వామ్యం వంటి సూత్రాలను పాటిస్తూ “ప్రజాస్వామ్య తల్లి”గా నిలిచిందని ఆయన గుర్తుచేశారు. మహిళా సాధికారతను కేవలం సంక్షేమ అంశంగా కాకుండా జాతీయ అభివృద్ధి యొక్క పునాది అనే కోణంలో చూడాలని సూచించారు. మహిళా విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టిన సావిత్రిబాయి ఫూలే వంటి సంస్కర్తల పాత్రను ఆయన గుర్తుచేశారు. మహారాష్ట్రలో వృద్ధ మహిళలకు గ్రామాల్లో విద్య అందించిన పాఠశాలల ఉదాహరణను ప్రస్తావించారు. ఇలాంటి కార్యక్రమాలు నేటి విధానాలకు ప్రేరణగా నిలుస్తాయని చెప్పారు. గ్రామీణ మరియు వెనుకబడిన వర్గాల మహిళలు విద్య, వ్యాపారారంభం, సమా జంలో నాయకత్వం వంటి రంగాల్లో సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ.. వారికి అవకాశాలు కల్పించినప్పుడు అవి విప్లవాత్మక ఫలితాలు ఇస్తాయని స్పీకర్ పేర్కొన్నారు. ఈ అవకాశాలను సమాజంలోని ప్రతి వర్గానికి విస్తరించాల్సిన అవసరం ఉందని, తద్వారా మహిళలు భారతదేశ ప్రగతిలో సమాన భాగస్వాములుగా నిలవగలరని అన్నారు. లింగ స్పందనాత్మక బడ్జెటింగ్ కేవలం

- Advertisement -
No country has ever developed without the participation of women 1

ఆర్థిక పద్ధతి మాత్రమే కాదు, మహిళల అవసరాలను జాతీయ అభివృద్ధి కార్యక్రమంలో సమగ్రంగా కలిపే సామాజిక-ఆర్థిక మోడల్ అని స్పీకర్ హైలైట్ చేశారు. బడ్జెట్లు మహిళలకు ఆరోగ్యం, విద్య, నైపుణ్యాలు, ఉపాధి రంగాల్లో సమాన అవకా శాలను కల్పించేలా ఉండాలని, అవి సామాజిక న్యాయ సాధనా లుగా మారాలని ఆయన అన్నారు. వనరుల కేటాయింపులో లింగ దృష్టికోణం అనుసరించడం ద్వారా మహిళల అవసరాలు అంచున కాకుండా ప్రధాన ప్రణాళికల్లో భాగం అవుతాయని స్పీకర్ పేర్కొన్నారు. మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర విభాగాల్లో జెండర్ బడ్జెట్ సెల్స్ ఏర్పాటు చేయాలని, మహిళల ఆరోగ్యం, విద్య, నైపుణ్యాలు, వ్యాపారారంగం, రుణ సౌకర్యాల కోసం కేటాయింపులను పెంచాలని, ఫలితాలను లింగ ప్రాతి పదికన డేటా ద్వారా పర్యవేక్షించాలని స్పీకర్ సూచించారు.

ఇవి బడ్జెట్లను సామాజిక న్యాయం మరియు సమగ్ర అభివృద్ధి సాధ నాలుగా మారుస్తాయని ఆయన తెలిపారు. కొత్త సాంకేతికతల అవకాశాలు, సవాళ్లను ప్రస్తావిస్తూ.. డిజిటల్ యుగంలో మహిళలు వెనుకబడకూడదని స్పీకర్ అన్నారు. డిజిటల్ అంతరాన్ని తగ్గించడం, సైబర్ భద్రత కల్పించడం, డిజిటల్ అక్షరాస్యతను విస్తరించడం కీలకమని ఆయన పేర్కొన్నారు. పూర్వంలో నిర్వహించిన వయోజన సాక్షరత కార్యక్రమాల మాదిరిగా మహిళలకు ప్రత్యేక డిజిటల్ సాక్షరత మిషన్లను చేపట్టాలని ప్రతిపాదించారు. ఇందులో మహిళా సాధి కారతకు స్పష్టమైన రోడ్మ్యప్ను ప్రతిపాదించారన్నారు. అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో లింగ దృష్టికోణం అనుసరించడం, ఆరోగ్యం, విద్య, నైపుణ్యాలు, వ్యాపారారంగం కోసం కేటాయిం పులను పెంచడం, జెండర్ స్పందనాత్మక బడ్జెటింగ్ను సంస్థాగతం చేయడం, జాతీయ, రాష్ట్ర స్థాయిలలో సాంకేతిక సామర్థ్యాన్ని

- Advertisement -
RELATED ARTICLES

Latest News