Tuesday, June 9, 2026
HomeజాతీయంNuclear | భారత అణుయుద్ధ విధానంలో మార్పు..

Nuclear | భారత అణుయుద్ధ విధానంలో మార్పు..

  • 12 అణుబాంబులను మోహరించిన రక్షణ శాఖ..
  • తాజా నివేదికలో తెలియజేసిన సిప్రి..

భారతదేశ రక్షణ, అణు ఆయుధ విధానంలో చరిత్రాత్మక మార్పు చోటుచేసుకున్నట్లు సమాచారం. దేశ రక్షణ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా భారత్ ప్రయోగించేందుకు సిద్ధంగా ఉండేలా 12 అణుబాంబులను మోహరించినట్లు అంతర్జాతీయ ఆయుధాల పర్యవేక్షణ సంస్థ ‘స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్’ (సిప్రి) తన తాజా నివేదికలో సంచలన విషయాన్ని వెల్లడించింది.

దశాబ్దాలుగా అనుసరిస్తున్న వ్యూహాత్మక విధానాన్ని పక్కనబెట్టి భారత్ ఈ అడుగు వేయడం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా శాంతి సమయాల్లో భారత్ తన అణుబాంబులను, వాటిని ప్రయోగించే క్షిపణులు లేదా యుద్ధ విమానాలను వేర్వేరు ప్రాంతాలలో భద్రపరుస్తుంది. కానీ ఇప్పుడు తొలిసారిగా అణుబాంబులను నేరుగా ప్రయోగించే వ్యవస్థలతో అనుసంధానించి, సైనిక స్థావరాల్లో లేదా భూగర్భ క్షిపణి కేంద్రాల్లో యుద్ధానికి సిద్ధంగా ఉంచినట్లు సిప్రి నివేదిక పేర్కొంది.

- Advertisement -

జూన్ 8న విడుదలైన ఈ నివేదిక ప్రకారం.. జనవరి 2026 నాటికి భారతదేశం వద్ద ఉన్న మొత్తం అణు ఆయుధాల సంఖ్య దాదాపు 190కి చేరింది. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య కొద్దిగా పెరిగింది. వీటిని భూమి, గగనతలం, సముద్రం.. ఈ మూడు మార్గాల ద్వారా ప్రయోగించేలా భారత్ తన సామర్థ్యాన్ని ఆధునికీకరించుకుంది. ముఖ్యంగా అణు జలాంతర్గాముల్లో ఈ సరికొత్త వ్యూహాత్మక అణుబాంబులను మోహరించి సముద్ర గర్భంలో నిరంతర నిఘా నిర్వహిస్తున్నట్లు నివేదిక స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News