- సద్వినియోగం చేసుకున్న 200 మంది..
ప్రతి ఒక్కరూ కళ్ళను ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మల్కాజ్గిరి ముదిరాజ్ సంఘం సీనియర్ అడ్వైజర్ పిట్ల మోహన్ రాజ్ అన్నారు. శనివారం మల్కాజ్గిరి ముదిరాజ్ సంఘం భవనంలో మల్కాజిగిరి ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఉచిత మేఘా కంటి పరీక్షల శిబిరం లయన్ ఎమ్మెస్ రెడ్డి ఆసుపత్రి సౌజన్యంతో నిర్వహించారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలో ఉన్న సుమారు 200 మందికి పైన హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఆపరేషన్లు ఉన్నవారికి ఆపరేషన్ ఆపరేషన్ చేయిస్తామని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ సలహాదారులు పిట్ల మోహన్ రాజ్ ముదిరాజ్, ఉపాధ్యక్షులు ఎస్ రాంచందర్, ప్రధాన కార్యదర్శి పి లక్ష్మీనారాయణ, ఉప కార్యదర్శి రాందాస్ ధనరాజ్, వారితోపాటు ముదిరాజ్ సంఘం సభ్యులు రాందాస్ అశోక్, మహంకాళి శ్రీను, కటికల గోపాల్, హనుమంతరావు, రాందాస్ సంతోష్ ముదిరాజ్, గాంధీ నారాయణ, మహేందర్, బళ్లారి అశోక్, మర్రి ప్రభాకర్ ప్రభాకర్, యాదగిరి, గణేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. కంటి పరీక్షల శిబిరానికి సహకరించిన ముదిరాజు సంఘం నేతలకు కుటుంబ సభ్యులకు పిట్ల మోహన్ రాజ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
