శనివారం జిల్లా పోలీస్ ఏఆర్ హెడ్క్వార్టర్స్లో సివిల్ రిజర్వ్, ఆర్మ్డ్ పోలీస్ సిబ్బందికి వీక్లీ పరేడ్ నిర్వహించారు. ఈ పరేడ్ వల్ల సిబ్బందిలో విధి నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడటమే కాకుండా, శారీరక దృఢత్వంతో ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుందని ఎస్పీ జానకి షర్మిల అన్నారు. పరేడ్లో పాల్గొన్న సిబ్బంది నుంచి ఆమె గౌరవ వందనం స్వీకరించారు. వ్యాయామాన్ని నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని, క్రమశిక్షణతో విధులు నిర్వహించి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆమె సిబ్బందికి సూచించారు.



- Advertisement -
