Homeనిజామాబాద్‌Adaab Hyderabad Impact| ఆదాబ్ హైదరాబాద్ ఎఫెక్ట్ .

Adaab Hyderabad Impact| ఆదాబ్ హైదరాబాద్ ఎఫెక్ట్ .

స్పందించిన అధికారులు ..!

తాడ్వాయి ప్రజావాణి కి అన్ని శాఖల అధికారుల హాజరు.

- Advertisement -

తాడ్వాయి :మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అధికారుల గైహాజర్ పై గత సోమవారం (Adaab Hyderabad Impact) ఆదాబ్ హైదరాబాద్ పత్రికలో “అంతా మా ఇష్టం ” ప్రజావాణికి పలు శాఖల అధికారుల డుమ్మా ” సమయపాలన పాటించని అధికారులు” అనే శీర్షిక కథనమైంది.

ఆ వార్త కథనంపై స్పందించిన ఎంపీడీవో భరత్ కుమార్ సంబంధిత శాఖ అధికారులకు ప్రజావాణి కి తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో నేడు జరిగిన ప్రజావాణికి అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరయ్యారు. కాగా ప్రజావాణి కి రెండు ఫిర్యాదులు వచ్చినట్లు ఎంపీడీవో తెలిపారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News