అసెంబ్లీ లోపల చూస్తేనేమో నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని ఒకరిమీద ఒకరు అరుపులు, కేకలు. బయట చూస్తేనేమో ధర్నాలు, లీడర్ల ఫోటోషూట్లు. టీవీలు పెడితే డిబేట్ల రచ్చ, ఫోన్ ఓపెన్ చేస్తే సోషల్ మీడియాలో సైబర్ వార్. ఇంత లొల్లి నడుస్తున్నా, గా పేదోని తిండి తిప్పల గొడవ, తాగునీళ్ల పంచాతీ, రోడ్ల గోతులు మాత్రం అట్లనే ఏడుస్తుంటాయి. కుర్చీమీద కేసీఆర్ కూసోని, రేవంత్ రెడ్డి కూసోని, లేకపోతే ఇంకెవ్వడైనా కూసోని.. మాకేం పాయిదా? సమస్య తీరనప్పుడు ఏ కుర్చీ అయితేనేం, ఏ జెండా అయితేనేం? ప్రశ్నించేటోడు ప్రజలైతే, బదులు చెప్పాల్సిందే ఎవడైనా సరే!పాలనలో నిజమైన మార్పు రావాలంటే సామాన్యుడు కేవలం ఓటేసి ఊరుకోకుండా, ప్రశ్నించడం మొదలుపెట్టాలి గంతే.. (Aaj Ki Baath)
- Advertisement -
