ఉద్యమం చేయకుండా భూ ప్రపంచంలో ఎలాంటి హక్కులు సాదించలేమని తెలంగాణ ఉద్యమకారుడు, జాతీయ గౌడ సంఘం నాయకులు, మాజీ టిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు వనందాస్ లక్ష్మి నారాయణ గౌడ్ పేర్కొన్నారు. కీసర మండల అంబెడ్కర్ సంఘం అద్వర్యంలో 211వ వారం జ్ఞానమాల కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మండల అంబెడ్కర్ సంఘం అధ్యక్షులు కర్రె గణేష్, ప్రధాన కార్యదర్శి మంచాల సంజీవ కమిటీ సభ్యులు ముఖ్య అతిధి లక్ష్మి నారాయణ గౌడ్కి అంబెడ్కర్ చిత్రపటంను జ్ఞాపికగా అందజేశారు.
- Advertisement -
