Wednesday, February 11, 2026
Homeకరీంనగర్Karimnagar | మేయర్ పీఠం కోసం కరీంనగర్‌లో రాజకీయ చదరంగం

Karimnagar | మేయర్ పీఠం కోసం కరీంనగర్‌లో రాజకీయ చదరంగం

  • సంఖ్యాబలం కోసం పోరు.. కరీంనగర్ కార్పొరేషన్ రాజకీయం రసవత్తరం
  • కరీంనగర్‌లో మేయర్ పీఠం చుట్టూ రాజకీయ తుపాను..
  • గెలుపే లక్ష్యంగా పార్టీల వ్యూహాలు.. కరీంనగర్ కార్పొరేషన్‌లో హై వోల్టేజ్ డ్రామా

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయాలు ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠను రేపుతు న్నాయి. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులే లక్ష్యంగా అధికార,ప్రతిపక్ష రాజకీయ పార్టీల మధ్య బహిరంగ పోరాటంతో పాటు తెర వెనుక రాజకీయం ముమ్మరంగా సాగుతోంది. గెలుపు సాధించడమే లక్ష్యంగా ‘గెలుపు గుర్రాల’ కోసం నేతలు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. బీఆరఎస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

గత పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలే తమ ప్రధాన ఆయుధమని చెబుతున్నప్పటికీ, కార్పొరేషన్‌లో సంఖ్యాబలం పక్కాగా లేదన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ప్రతి కార్పొరేటర్ కీలకంగా మారి, వారిని తమవైపు తిప్పుకునేందుకు అంతర్గతంగా చర్చలు సాగుతు న్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు బీజేపీ కరీంనగర్‌ను పట్టణ రాజకీయాల్లో కీలక కేంద్రమని భావిస్తూ గట్టిగా దూకుడు పెంచు తోంది.

- Advertisement -

కేంద్ర ప్రభుత్వ పథకాలు, పట్టణ అభివృద్ధి పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని ప్రయత్నిస్తూనే, బీఆరఎస్ పాలనలోని లోపాలను ఎండగడు తోంది. ఈ ఎన్నికల ద్వారా కార్పొరేషన్‌పై పట్టు సాధిస్తే, భవిష్యత్ రాజకీయాలకు బలమైన పునాది పడుతుందన్నది బీజేపీ అంచనా.
ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఆసక్తికరంగా మారింది. గతంలో బలహీనంగా కనిపించినా, ఇప్పుడు బీఆరఎస్-బీజేపీల మధ్య జరుగుతున్న పోరులో కీలకంగా మారాలని పార్టీ వ్యూహాలు రచిస్తోంది. కొద్ది మంది కార్పొరేటర్లతో ఉన్నా, తమ మద్దతు ఎవరి వైపు వెళ్తుందన్నదే కీలకంగా మారడంతో కాంగ్రెస్ నేతలు చర్చల్లో బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం కార్పొరేషన్‌లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో తటస్థ కార్పొరేటర్లే రాజకీయం నడిపిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభివృద్ధి హామీలు, పదవుల ఆశ చూపిస్తూ ఒప్పందాలు కుదురుతున్నాయన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇదే సమయంలో ప్రజాస్వామ్య విలువలు తాకట్టు పడుతున్నాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మేయర్ పీఠం ఎవరి సొంతమవుతుందన్న దానిపై రోజుకో కొత్త ప్రచారం వెలుగులోకి వస్తోంది.

రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న ఈ బలం-బలహీనతల పోరు కరీంనగర్ నగర పాలన భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తోంది. ప్రజల ఆశలకన్నా సంఖ్యాబలాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మొత్తానికి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయాలు ఇప్పుడు గరిష్ట ఉష్ణోగ్రతలకు చేరుకున్నాయి. బహిరంగ సభలకంటే రహస్య సమావేశాలే ఎక్కువగా సాగుతున్న ఈ పోరులో చివరకు ఎవరి ‘గెలుపు గుర్రం’ విజయం సాధిస్తుందో, ప్రజాస్వామ్యం గెలుస్తుందా లేక రాజకీయ ఒప్పందాలే పైచేయి సాధిస్తాయా అన్నది వేచి చూడాల్సిందే.

- Advertisement -
RELATED ARTICLES

Latest News