ప్రపంచ ప్రఖ్యాత ధ్వన్యనుకరణ సామ్రాట్, పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్(Nerella Venumadhav) జయంతి సందర్భంగా నిజామాబాద్ పట్టణంలోని వీఎన్ఆర్ స్కూల్లో ఆదివారం ప్రముఖ సైకాలజిస్టు తిరునగరి శ్రీహరి నేతృత్వంలో ప్రపంచ మిమిక్రీ దినోత్సవాన్ని(World Mimicry Day) ఘనంగా నిర్వహించారు. పట్టణానికి చెందిన ప్రముఖ వెంట్రిలాక్విస్ట్ రంగనాథ్, మిమిక్రీ స్టార్ బోండ్ల ఆనంద్, మిమిక్రీ రత్న వాసా రాబర్ట్, మెజీషియన్ శ్రీనివాస్, సింగర్ అజయ్ కుమార్.. దివంగత వేణుమాధవ్కి స్వరార్చన చేశారు. అనంతరం.. మిమిక్రీ కళాకారుల(Artists)ను ఘనంగా సత్కరించి(Honored) జ్ఞాపికలను(Memories) బహుకరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్లు వీణ, ప్రసన్న, టీచర్లు, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు.
- Advertisement -
