అమరావతిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు(Government Banks), బీమా కంపెనీల (Insurance Companies) ప్రధాన కార్యాలయాల(Head Offices)కు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala seetharaman), సీఎం చంద్రబాబు(CM Chandrababu) శంకుస్థాపన చేశారు. మొత్తం 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన చేశారు. ఇందులో.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూబీఐ, కెనరా బ్యాంక్, ఏపీ గ్రామీణ బ్యాంక్, ఐడీబీఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎల్ఐసీ, నాబార్డ్ ఉన్నాయి. రాజధాని సీడ్ యాక్సెస్ రహదారి పక్కన సీఆర్డీఏ ప్రాజెక్టు ఆఫీస్ వద్ద ఫస్ట్ బ్లాక్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan), మంత్రులు నారా లోకేష్, నారాయణ, పయ్యావుల కేశవ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, బ్యాంకుల చైర్మన్లు, సీఎండీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Foundation stone laying | ఒకేసారి 15 బ్యాంకులు, బీమా సంస్థలకు
- Advertisement -
RELATED ARTICLES
