ఇజ్రాయెల్ (Israel) పీఎం (PM) బెంజమిన్ నెతన్యూహు (Benjamin Netanyahu) ఇండియా పర్యటన (India Tour) రద్దయినట్లు తెలుస్తోంది. ఆయన ఈ ఏడాది చివరలో మన దేశానికి రావాల్సి ఉంది. కానీ.. ఇటీవల ఢిల్లీలోని ఎర్రకోట (Red Fort in Delhi) వద్ద భద్రతాపరమైన సమస్యలు తలెత్తిన నేపథ్యంలో టూర్ క్యాన్సిల్ చేసుకున్నట్లు సమాచారం. నెతన్యాహు వాస్తవానికి సెప్టెంబర్ 9నే భారత్కు రావాల్సి ఉంది. కానీ.. షెడ్యూల్ సమస్య (scheduling problem) వల్ల వాయిదా పడింది. లేటెస్ట్గా కూడా పోస్ట్పోన్ (Postpone) అవటంతో 2026లో వచ్చే అవకాశం ఉంది. అయితే.. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇరు దేశాల ప్రధానుల మధ్య సన్నిహిత సంబందాలు ఉన్నప్పటికీ రాకపోకలు మాత్రం 2018 తర్వాత జరగలేదు. 2017లో మోదీ (Modi) టెల్అవీవ్లో పర్యటించగా 2018లో నెతన్యాహు ఇండియాకి వచ్చి వెళ్లారు.
Cancel | ఇజ్రాయెల్ పీఎం ఇండియా టూర్ క్యాన్సిల్?
- Advertisement -
RELATED ARTICLES
