కార్తీక మాసం (Kartheeka Masam) సందర్భంగా ఆదివారం కీసరగుట్ట (Keesaragutta) శ్రీ రామలింగేశ్వర స్వామి (Ramalingeshwara Swami) దర్శనానికి భక్తులు (devotees) అధిక సంఖ్యలో రావడంతో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర చౌరస్తాలో భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయింది. దీంతో.. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ పోలీసులు (Police) ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతోనే తరచూ ట్రాఫిక్ జామ్ అవుతోందని స్థానికులు (Local People) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -
