హైదరాబాద్ : పట్టణ ప్రాం తాల్లో నివసిస్తున్న వారు ఎక్కువగా చర్మ వ్యాధులకు మరియు హెయిర్ ఫాల్స్ కి ఎక్కువగా గురవుతున్నారని సినీనటి వైష్ణవి చైత్యన అన్నారు. ఆదివారం ఆమె కోకాపేట్లో నూతనంగా ఏర్పాటు చేసిన సెలెస్టీ స్కిన్ లేజర్, హెయిర్ క్లినిక్ని సినీనటులు ఆనంద్ దేవరకొండ, విరాజ్తో కలిసి ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లా డుతూ చర్మ వ్యాధుల్లో, హెయిర్ ట్రీట్మెంట్ కోసం ప్రస్తుతం అధునాతన శస్త్ర చికిత్సలు నగరంలో కూడా అందు బాటులోకి వచ్చాయని ఒకప్పుడు ముంబై, చెన్నై, బెంగ ళూరు, ఇతర దేశాలకు వెళ్ళాల్సి వచ్చేదని అన్నారు. అత్యాధునిక పరికరాలతో, ప్రపంచ స్థాయి వైద్యం అందించేందుకు సెలెస్టీ స్కిన్ లేజర్, హెయిర్ క్లినిక్ని కోకాపేట్ లో ఏర్పాటుచేయడం అభినందనీయమని ఈ సందర్భంగా ఆమె నిర్వాహకులను అభి నందించారు. నేటియువత, మహిళలు స్కిన్కేర్, హెయిర్ పై ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారని అలాంటి వారికి ఇది ఎంతగానో ఉపయోగ పడుతుందని అన్నారు. నగర వాసుల అవసరాలు తీర్చేందుకు నగరంలో మరిన్ని శాఖలు తెరవనున్నామని నిర్వాహ కులు డాక్టర్ రాజ్ కిరీటి ఈ. పి. డాక్టర్ శ్రీదేవి తెలిపారు.