జూబ్లీహిల్స్ ప్రచారంలో మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి
తెలంగాణ: ప్రపంచ పటం(World Map)లో హైదరాబాద్(Hyderabad)ను అత్యున్నత స్థానంలో నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం (State Government) ప్రణాళికాబద్ధంగా (Planned) పని చేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (JubileeHills Bye Election) ప్రచారంలో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించారు. 20 నెలల వ్యవధిలోనే రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు (Investments) తీసుకొచ్చామని చెప్పారు. BRS పార్టీ పాలనలో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థ(Economy)ను చక్కదిద్దుతూ మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీనీ దశలవారీగా నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు.
