కరీంనగర్: కరీంనగర్ జిల్లా, కొత్తపల్లి మండలం ఆసిఫ్నగర్ గ్రామంలోని రెండు వార్డు మెంబర్ స్థానాలు ఆదివారం ఏకగ్రీవం అయ్యాయి. నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో ఆసిఫ్నగర్ గ్రామ పంచాయితీలోని 4వ వార్డులో కడారి శ్రీనివాస్, 8వ వార్డులో దూలం సుధాకర్ లు మాత్రమే నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. దీంతో వీరి ఎన్నిక ఏకగ్రీవంగా ఖరారైంది. దూలం సుధాకర్ గతం లో మాజీ వార్డు సభ్యులుగా ప్రాతినిధ్యం వహించారు.
ఆసిఫ్నగర్ (కొత్తపల్లి మండలం, కరీంనగర్ జిల్లా)
ఏకగ్రీవం అయిన వార్డులు: 4వ వార్డు, 8వ వార్డు
4వ వార్డు విజేత: కడారి శ్రీనివాస్,
8వ వార్డు విజేత: సుధాకర్ (మాజీ వార్డు సభ్యుడు ) వార్డ్ సభ్యులు గా ఏకగ్రీవం అయిన సందర్భంగా పలువురు వర్షం వ్యక్తం చేస్తున్నారు

