‘సిట్’ను ఏర్పాటుచేస్తూ డీజీపీ నిర్ణయం
సీపీ సజ్జనార్ నేతృత్వంలో లోతుగా దర్యాప్తు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్(Hyderabad Police Commissioner) CP సజ్జనార్(Sajjanar) నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(Special Investigation Team) ఏర్పాటుచేశారు. ఇందులో 9 మంది అధికారులు ఉన్నారు. సీపీ సజ్జనార్, రామగుండం సీపీ ఆంబరి కిషోర్ జా, సిద్ధిపేట సీపీ విజయ్ కుమార్, మాదాపూర్ డీసీపీ రితి రాజ్, మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డితోపాటు రవీందర్, వెంకటగిరి, ks రావు, శ్రీధర్, నాగేందర్రావు నేతృత్వంలో సిట్ విచారణ చేపట్టనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరింత లోతైన ఇన్వెస్టిగేషన్(Deep Investigation)కు డీజీపీ (DGP) శివధర్రెడ్డి (Shivadhar Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు.
