- జగదేవపూర్ ఎస్ఐ కృష్ణారెడ్డి
ప్రమాదాలను అరికట్టడానికే స్పీడ్ బ్రేక్లను ఏర్పాటు చేశామని జగదేవపూర్ ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగదేవపూర్ పోలీస్ స్టేషన్ ఎదుట నుండి ఎన్నో వాహనాలు వస్తూ ,పోతూ ఉంటాయని తరచు ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరిగాయని వాటిని దృష్టిలో పెట్టుకొని పోలీస్ అధికారులు చొరవ తీసుకొని ఇకనుండి అలాంటి ప్రమాదాలు జరగకుండా స్పీడ్ బ్రేకులు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.
అంతేకాకుండా రాత్రి వేళలో స్పీడ్ బ్రేకులు స్పష్టంగా వాహనదారులకు కనిపించే విధంగా వాటిపై తెలుపు రంగు వేయడం జరిగిందని అన్నారు. ఇకనుండి వాహనదారులు వాటిని దృష్టిలో పెట్టుకొని వాహనాలను నెమ్మదిగా వెళ్లాలని తెలియజేస్తూ సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకోవాలనీ తెలియజేశారు.

