Tuesday, May 26, 2026
Homeజాతీయంరాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్‌గా డాక్టర్ కె. లక్ష్మణ్ బాధ్యతల స్వీకారం

రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్‌గా డాక్టర్ కె. లక్ష్మణ్ బాధ్యతల స్వీకారం

ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ మంగ‌ళ‌వారం రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్‌గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమం పార్లమెంట్ ప్రాంగణంలో ఘనంగా జరిగింది. బాధ్యతల స్వీకార కార్యక్రమంలో రాజ్యసభ కార్యదర్శి సోమశేఖర్ జీ, నూనె బాల్‌రాజ్‌తో పాటు పలువురు సీనియర్ నాయకులు, అధికారులు, పార్లమెంట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కె. లక్ష్మణ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన నాయకత్వంలో హౌస్ కమిటీ సమర్థవంతంగా పనిచేస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యుల వసతి, సౌకర్యాలు మరియు ఇతర పరిపాలనా అంశాలను పర్యవేక్షించే కీలక బాధ్యత హౌస్ కమిటీపై ఉంటుంది. ఈ బాధ్యతలను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు కట్టుబడి పనిచేస్తానని డాక్టర్ కె. లక్ష్మణ్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News