- తాడ్వాయి మండల బి ఆర్ ఎస్ నాయకులు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కెసిఆర్ మరణాన్ని కోరడాన్ని నిరసిస్తూ మంగళవారం తాడ్వాయి మండలంలోని బిఆర్ఎస్ నాయకులు తాడ్వాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు(Complaint) చేశారు. వీర్లపల్లి శంకర్ పై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తాడ్వాయి మండల కన్వీనర్ ముదాం నర్సింలు, నాయకులు చంద్రారెడ్డి, పీసు రాజిరెడ్డి,మంగారెడ్డి, కొర్ని నర్సింలు, గోపాలరావు నవీన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.(aadabhyderabad.in)
- Advertisement -
