- బెల్లంపల్లి మున్సిపాలిటీలో ప్లాస్టిక్ విక్రయ దుకాణాలపై ఆకస్మిక దాడులు
నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ ఈ దాడులలో 120 మైక్రాన్లకు లోపు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (SUP) విక్రయిస్తున్నట్లు గుర్తించబడింది.
మొత్తం 40 కిలోల నిషేధిత ప్లాస్టిక్ను స్వాధీనం చేసుకొని, సంబంధిత రెండు దుకాణాలలో సోదాలు నిర్వహించారు రెండు దుకాణాలలో ప్లాస్టిక్ కవర్స్ దొరకడంతో రెండు దుకాణాల యజమానులపై ఒక దుకాణానికి 8000రూపాలు జరిమానా విధించారు రెండు దుకాణాల యజమానులకు 16000 జరిమానా విధించారు భవిష్యత్తులో ఇలాంటి నిషేధిత ప్లాస్టిక్ విక్రయాలు చేయకూడదని కమిషనర్ షాప్ యజమానులకు హెచ్చరించారు .

పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ప్రజలు మరియు వ్యాపారులు నిషేధిత ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ క్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి, ic/శానిటరీ ఇన్స్పెక్టర్ సునీల్, EE సంతోష్, ward officer పురుషోత్తo, మరియు జవాన్లు పాల్గొన్నారు.


