డా. బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద అంబర్ పేట్ చెక్ పోస్ట్ వద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూల మాలలు వేసి నివాళులు అర్పిస్తున్న బహుజన సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి గ్యార మల్లేష్. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ..

దేశానికి దశా, దిశ చూపించిన, సామాజిక సమానత్వం కోసం అహర్నిశలు పోరాడిన, భారత రాజ్యాంగ శిల్పి డా. బి.ఆర్. అంబేద్కర్ గారి ఆత్మ శాంతించాలంటే ఆయన ఆశయాల కోసం ఓటు వేసినప్పుడే ఆ మహానీయుడి ఆత్మ శాంతిస్తుందని, ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగితేనే నిజమైన ప్రజాస్వామ్యం బలపడుతుందనీ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ రంగారెడ్డి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ యంజాల ప్రహ్లాద్, నాయకులు చిత్రం కృష్ణ, గట్టు నరసింహ, మంద శివ, చిత్రం బాలరాజ్, బంటి, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
