రక్తం చిందిన చోట రగిలిన ఆగ్రహం.. మౌనం దాల్చిన పాలకుడిపైకి ఉప్పెనలా ప్రజాచైతన్యం ! మేకులు గుచ్చిన లాఠీల దెబ్బలకు యువత గుండెలు మండినా.. టియర్ గ్యాస్ పొగల్లో కళ్లు చెమర్చినా.. ఆ రగిలిన కన్నీళ్లే నేడు తిరుగుబాటు జ్వాలలయ్యాయి.. ! కాక్రోచ్ యువతపై అణచివేత.. నేడు తల్లిదండ్రుల, ప్రతిపక్షాల, యావత్ భారత ప్రజానీకపు నిరసనై ఎగిసిపడుతోంది. విద్యార్థుల ఆక్రందనలు వీధులను దాటి, పాలకుల బారికేడ్లను బద్దలు కొడుతూ.. ప్రధాని కోట తలుపులు తట్టడానికి సైతం వెనుకాడకుండా కదం తొక్కాయి.. ప్రధాని మౌనం వీడితేనే.. పరిష్కారం లభిస్తుందన్నది మేధావుల వాదన..
- Advertisement -
