ప్రజాస్వామ్యంలో ఎన్నికలు రావడం సహజం… ప్రభుత్వాలు మారడం సహజం కానీ.. ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం రావడమే అసలు పాలన.. రైతుకు న్యాయం, యువతకు ఉద్యోగం, పేదలకు ఇల్లు, మహిళలకు భద్రత, విద్యార్థులకు నాణ్యమైన విద్య, ప్రజలకు మెరుగైన వైద్యం అందాలి. హామీలు ఎన్నికలకే పరిమితం కాకూడదు… అమలులో కనిపించాలి. అధికారంలో ఉన్నవారు జవాబుదారీతనంతో పనిచేయాలి. ప్రతిపక్షం ప్రజా సమస్యలపై బాధ్యతాయుతంగా పోరాడాలి. అభివృద్ధి, పారదర్శకత, ప్రజా సంక్షేమమే రాజకీయాల అసలు లక్ష్యం కావాలి. ఎందుకంటే… ప్రజలు గుర్తుంచుకునేది మాటలను కాదు… చేసిన పనులను..
- హనుమకొండ ఉపేంద్ర చారి
- Advertisement -
