అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న
తెలంగాణకు, పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు
ఒక తీవ్రమైన హెచ్చరిక. జాతీయ సగటు
కంటే వేగంగా పెరుగుతున్న ఈ రక్తాశ్రువులు,
కేవలం రహదారుల లోపాలను మాత్రమే
కాకుండా, మన ప్రయాణ సంస్కృతిలో మార్పు
రావాల్సిన అవసరాన్ని కూడా
గుర్తుచేస్తున్నాయి. వేగం కంటే ప్రాణం మిన్న
అని ప్రతి ఒక్కరూ గ్రహించనంత వరకు,
చట్టాలు, సాంకేతికత మాత్రమే ప్రాణాలను
రక్షించలేవు. రహదారి భద్రత అనేది కేవలం
ప్రభుత్వ బాధ్యత కాదు, అది ప్రతి ఒక్కరి
సామాజిక బాధ్యత. రేపటి ప్రయాణం
సురక్షితంగా సాగాలంటే, నేడే మన
అప్రమత్తత పెరగాలి.
- Advertisement -
