Thursday, June 18, 2026
HomeజాతీయంDigital Cabinet | కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం..

Digital Cabinet | కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం..

  • డిజిటల్ విధానంలో అసెంబ్లీ సమావేశాలు..
  • ప్రాజెక్ట్ కు మొదటివిడత రూ. 20 లక్షలు విడుదల..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్ సమావేశాలను డిజిటల్ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ విధానం అమలు కోసం రూ.2 కోట్ల వ్యయంతో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అమలులో ఉన్న క్యాబినెట్ డిజిటల్ విధానాన్ని తెలంగాణ అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసి అమలు చేయనున్నారు.

ప్రధాన అంశాలు:

- Advertisement -

నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సర్వీసెస్ ఇన్‌కార్పొరేటెడ్ తో చర్చలు జరిపి సాఫ్ట్‌వేర్‌ను అనుకూలీకరిస్తున్నారు. తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ ను నోడల్ ఏజెన్సీగా నియమించారు. ప్రాజెక్టు మొదటి విడతగా రూ.20 లక్షల నిధులు విడుదల చేశారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ట్యాబ్‌లు, కంప్యూటర్ల ద్వారా ఎజెండాలు, ఫైల్స్ పరిశీలించవచ్చు.

క్యాబినెట్ నోట్స్, ప్రతిపాదనలు, నిర్ణయాలు పూర్తిగా డిజిటల్ రూపంలో ఉంటాయి. ఈ విధానం ద్వారా పరిపాలనలో వేగం, పారదర్శకత, సౌలభ్యాన్ని పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. డేటా లీకేజీ, హ్యాకింగ్ నివారణకు ప్రత్యేక లాగిన్ ఐడీలు, పాస్‌వర్డ్‌లు, బలమైన సెక్యూరిటీ వ్యవస్థలను అమలు చేయనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News