Wednesday, April 22, 2026
Homeఆదిలాబాద్MP | ప్రయాణికుల సౌకర్యాలపై ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రత్యేక దృష్టి

MP | ప్రయాణికుల సౌకర్యాలపై ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రత్యేక దృష్టి

పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ మంచిర్యాల రైల్వే స్టేషన్ను సందర్శించి, అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులను సవివరంగా పరిశీలించారు. పనుల నాణ్యతపై ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేస్తూ, ప్రతి పని సమయానికి పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు.

ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ…

- Advertisement -

ప్రయాణికులకు సురక్షితమైన, ఆధునిక సౌకర్యాలు అందించడమే తన ప్రధాన లక్ష్యమని అన్నారు స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, తాగునీరు, కూర్చునే సదుపాయాలు, లైటింగ్, పార్కింగ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అదనంగా, వృద్ధులు, మహిళలు, దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రయాణికుల సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా అధికారులు స్పందించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, డీసీపీ ప్రెసిడెంట్ రఘునాథ్ అధికారులు ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News