Saturday, April 11, 2026
HomeతెలంగాణChallenge | ఘాటుగా స్పందించిన వాకిటి శ్రీహరి..

Challenge | ఘాటుగా స్పందించిన వాకిటి శ్రీహరి..

  • ఐపీ డీకే అరుణ సవాల్ ని స్వీకరిస్తున్నా..

మక్తల్ నియోజకవర్గంలోని అమరచింత పెద్ద చెరువు సుందరీకరణ పనుల చుట్టూ ముదిరిన ప్రోటోకాల్ వివాదం ఇప్పుడు రాజకీయ సవాళ్లు, ప్రతి సవాళ్లకు వేదికైంది. కేంద్రం అందిస్తున్న అమృత్ 2.0 నిధుల విషయంలో బీజేపీ ఎంపీ డీకే అరుణ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ఘాటుగా స్పందించారు.

మక్తల్ అభివృద్ధికి కేంద్రం వాటా ఎంత, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందేమిటో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని డీకే అరుణ విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, పాలమూరు జిల్లాలో డీకే అరుణ రాజకీయ శైలి మరియు రౌడీయిజం గురించి ఎవరిని అడిగినా చెబుతారంటూ ఎద్దేవా చేశారు.

- Advertisement -

ఇప్పటికే ప్రారంభమై కొనసాగుతున్న పనులకు మళ్లీ శంకుస్థాపన చేయాలని చూడటం సరికాదని, అటువంటి ప్రయత్నాలను అడ్డుకోవడంలో తప్పులేదని మంత్రి సమర్థించుకున్నారు. తాను రాజకీయాల్లో ఒకే పార్టీలో ఉంటూ ఎదిగానని, ప్రోటోకాల్ నిబంధనల గురించి తనకు పూర్తి అవగాహన ఉందని స్పష్టం చేశారు. ఒక బీసీ బిడ్డ మంత్రి పదవిలో ఉండి అభివృద్ధి పనులు చేస్తుంటే డీకే అరుణ సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు.

తాను మహిళలను ఎప్పుడూ గౌరవిస్తానని, డీకే అరుణను వ్యక్తిగతంగా అవమానించే ఉద్దేశం తనకు లేదని, కేవలం రాజకీయ వైఫల్యాలనే ప్రశ్నిస్తున్నానని మంత్రి క్లారిటీ ఇచ్చారు. నిధుల కేటాయింపు మరియు అభివృద్ధిపై ఏ వేదిక మీదనైనా చర్చకు రావాలని ఆయన ప్రతి సవాల్ విసిరారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News