ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో ఇండియన్ సోషల్ ఇన్స్టిట్యూట్,ఓయూ సోషియాలజీ విభాగం సంయుక్తంగా నిర్వహిస్తున్న రెండు రోజుల పీస్, రికన్సలియేషన్ అండ్ సోషల్ హార్మోని సదస్సు మంగళవారం ప్రారంభమైంది.ప్రధాన వక్త డాక్టర్ డెంజిల్ ఫెర్నాన్డేజ్ మాట్లాడుతూ ప్రభుత్వాలు,సంస్థలు,పౌర సమాజం సమన్వయంతోనే ప్రపంచ శాంతి సాధ్యమన్నారు.క్లైమేట్ చేంజ్, ఏఐ,సైబర్ వార్ ఫేర్ వంటి నూతన సవాళ్లపై అవగాహన అవసరమని పేర్కొన్నారు.బాల హక్కుల పరిరక్షణ,బాల కార్మిక నిర్మూలనపై ఇతర వక్తలు ప్రాధాన్యతను వివరించారు.సమాజంలో భౌతిక,మానసిక హింసకు చెక్ పెట్టేందుకు సమిష్టి కృషి అవసరమని సదస్సు అభిప్రాయపడింది.
- Advertisement -
