300 ఎకరాల భూమి కేంద్ర విమానయాన శాఖకు అప్పగింత
వరంగల్ చారిత్రక కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క(Deputy CM MalluBhattivikramarka) చెప్పారు. వరంగల్ మామునూరు విమానాశ్రయ(Mamunur Airport) పునరుద్ధరణకు 300 ఎకరాల భూమిని కేంద్ర విమానయాన శాఖకు అప్పగించిన(Land Transfer) ఈ రోజు తెలంగాణ విమానయాన చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు అని అన్నారు. 1930లో నిజాం కాలంలోనే నిర్మితమై ఒకప్పుడు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా వెలుగొందిన మామునూరు వైభవాన్ని తిరిగి తెచ్చేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రూ.300 కోట్ల నిధులు కేటాయించి దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ భూసేకరణ ప్రక్రియను పూర్తి చేశామని వెల్లడించారు. సహకారం అందిస్తున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడి(RammohanNaidu)కి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
